విశ్వనాథ సత్యనారాయణ (1895-1976) "కవి సామ్రాట్" బిరుదాంకితుడు. తెలుగు సాహిత్యంలో తొలిజ్ఞానపీఠ అవార్డు గ్రహీత. 20 వ శతాబ్దములోని ఆంధ్ర సాహిత్యమునకు, ప్రత్యేకించి సంప్రదాయ సాహిత్యమునకు పెద్ద దిక్కు. ఆయన చేపట్టని సాహిత్య ప్రక్రియ లేదు.- కావ్యములు, కవితలు, నవలలు, నాటకములు, ప్రయోగములు, విమర్శలు, వ్యాసములు, కథలు, చరిత్రలు – ఆయన పాండిత్యము, ప్రతిభలు జగమెరిగినవి. ఆయన మాటలలోనే "నేను వ్రాసిన పద్యముల సంఖ్య , ప్రకటింప బడినవాని సంఖ్య, సుమారు ఇరువది వేలుండ వచ్చును. నేను చింపివేసినవి ఏబది వేలుండవచ్చును " . ఆయన రాసిన రచనలన్నీ కలిపితే లక్షపుటలుండవచ్చును.
జీవిత విశేషాలు:-
శ్రీ విశ్వనాథ సత్యనారాయణ గారు1895, సెప్టెంబరు 10న (మన్మథ నామ సంవత్సర భాద్రపద బహుళ షష్ఠి) కృష్ణా జిల్లా నందమూరు గ్రామం (నేటి ఉంగుటూరు మండలం)లో జన్మించాడు. తండ్రి శోభనాద్రి, తల్లి పార్వతమ్మ. ఈయన భార్య వరలక్ష్మమ్మ. విద్యాభ్యాసము నందమూరు, ఇందుపల్లి, మరియు పెదపాడు గ్రామాల్లోను, పై చదువులు బందరు పట్టణంలోను సాగాయి. బందరు హైస్కూలులో చెళ్ళపిళ్ళ వేంకట శాస్త్రి తెలుగు ఉపాధ్యాయునిగా లభించడం ఆయన అదృష్టం. బి.ఎ. తరువాత విశ్వనాథ బందరు హైస్కూలులోనే ఉపాధ్యాయునిగా చేరారు. ఉద్యోగం చేస్తూనే మద్రాసు విశ్వవిద్యాలయం నుంచి ఎమ్.ఎ. పట్టా సాధించారు. తరువాత మహాత్మా గాంధీ నడపుతున్న సహాయ నిరాకరణోద్యమంలో పాల్గొనడం కోసం ఉద్యోగాన్ని వదులుకున్నాడు.తరువాతి కాలంలో ఈయన వివిధ కళాశాలల్లో అధ్యాపక పదవులు నిర్వహించాడు. బందరు నేషనల్ కాలేజి (1928), గుంటూరు ఆంధ్రా క్రిస్టియన్ కాలేజి (ఏసీ కాలేజీ) (1938 వరకు), విజయవాడలో ఎస్.ఆర్.ఆర్.& సి.వి.ఆర్. కాలేజి (1938-1959)(ఈ కళాశాల ఎస్.ఆర్.ఆర్. ప్రభుత్వ కళాశాల గా మార్పు చెందింది), కరీంనగర్ ప్రభుత్వ ఆర్ట్స్ & సైన్స్ కాలేజి (1959) మొదలైన కళాశాలల్లో ఆయన పని చేసాడు. 1957లో విశ్వనాథ ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ ఉపాధ్యక్షుడుగానూ, 1958లో విధానమండలికి నామినేటెడ్ సభ్యుడుగానూ విధులు నిర్వర్తించారు.
1976 అక్టోబరు 18న (నల నామ సంవత్సర ఆశ్వయుజ బహుళ దశమి) శ్రీ విశ్వనాథ సత్యనారాయణ గారు పరమపదించారు.
సాహితీ ప్రస్థానం:-
1961 లో కరీంనగర్ ప్రభుత్వ కళాశాలలో ప్రిన్సిపాలుగా పదవీ విరమణ చేసిన తరువాత పూర్తి స్థాయిలో తన సమయాన్ని సాహితీ వ్యాసాంగానికి కేటాయించాడు. 1916 లో "విశ్వేశ్వర శతకము" తో విశ్వనాథ రచనా ప్రస్థానము ప్రారంభమైనది. అప్పటి జాతీయోద్యమ ప్రభావంతో ఆసమయంలోనే "ఆంధ్రపౌరుషము" రచించాడు. 1920నాటికే తెలుగులో ప్రసిద్ధ కవిగా గుర్తింపు తెచ్చుకొన్నాడు.
తరువాత విశ్వనాథ రచనా పరంపర పుంఖానుపుంఖాలుగా కొనసాగింది. మొత్తానికి 25 పైచిలుకు కావ్యాలు, 6 శతకాలు, 13 గేయకావ్యాలు, 15 నాటకాలు, 88 నవలలు, 10 సంస్కృత నాటకాలు, 10 విమర్శనా గ్రంధాలు, మరెన్నో వ్యాసాలు, ఉపన్యాసాలు – ఇలా తెలుగుభాషకు విశ్వనాథ వందల్లో రచనలందించాడు. ఆయన రచనలను కొన్ని ఇతర భాషలలోకి అనువదించారు. రేడియో కోసం నాటకాలు, ప్రసంగాలు రూపొందించాడు.
ప్రముఖ బెంగాలీకవి రవీంద్రనాధ టాగూరు వలె తన రచయితలను కొన్నైనా ఆంగ్లంలోకి తర్జుమా చేసుకొంటే ఆయన అంతర్జాతీయ ఖ్యాతినర్జించి ఉండేవాడని ఆయన అభిమానులు అంటుంటారు. అయితే విశ్వనాధ రచనలను విశ్లేషించే విమర్శకుడు ఆయన తాత్విక స్థాయిని అర్ధం చేసుకొంటే గాని సాధ్యం కాని విషయం
ముఖ్య రచనలు:-
విశ్వనాథ రచనల్లో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సినవి – ఆంధ్రపౌరుషము, రామాయణ కల్పవృక్షము, వేయిపడగలు, కిన్నెరసాని పాటలు, పురాణవైర గ్రంథమాల, కాశ్మీర చారిత్రిక నవలలు, విశ్వనాథ మధ్యాక్కఱలు, నన్నయ ప్రసన్నకథాకలితార్థయుక్తి వంటివి. తెలుగు తనమన్నా, తెలుగు భాషన్నా విశ్వనాధకు ప్రత్యేక అభిమానం. ఆంధ్ర పౌరుషం, ఆంధ్రప్రశస్తి ఆయన మొదటి రచనలలోనివి. విశ్వనాధ రచనలలో అతని పాండిత్యమే కాక, రచనాశిల్పం, పాత్ర చిత్రణ, చారిత్రిక అవగాహన అద్భుతంగా కనిపిస్తుంటాయి.
తన రచనలలో శ్రీమద్రామాయణ కల్పవృక్షం (జ్ఞానపీఠ అవార్డు లభించినది) తనకు వ్యక్తిగతంగా ఎంతో తృప్తినిచ్చిందని చెప్పాడు. ఎందరో కవులు వ్రాసినా మళ్ళీ ఎందుకు వ్రాయాలంటే రోజూ తింటున్నామని అన్నం తినడం మానివేయడంలేదుగదా అన్నాడు. తమిళనాడులోని మధురై ప్రాంతం నేపధ్యంలో వచ్చిన నవల "ఏకవీర"ను పుట్టపర్తి నారాయణాచార్యులు మళయాళంలోనికి, అంబటిపూటి హనుమయ్య తమిళంలోనికి అనువదించారు. ఏకవీర సినిమా కూడా వచ్చింది. ఆ సినిమాకు సి.నారాయణరెడ్డి మాటలు, పాటలు సమకూర్చాడు. వేయిపడగలు నవలను మాజీ ప్రధాన మంత్రి పి.వి.నరసింహారావు "సహస్రఫణ్" పేరుతో హిందీ లోకి అనువదించాడు. భారతీయ సంస్కృతి, ఆచారం, విశేషాలు, మధ్య తరగతి జీవన విధానాలు ఈ నవలలో విశేషంగా చూపబడ్డాయి. కోకిలమ్మ పెళ్ళి, కిన్నెరసాని పాటలు (ఆనాటి) యువతరాన్ని ఆకట్టుకొనే వ్యావహారిక భాషలో వ్రాశాడు. విశ్వనాధ నవలలలో పురాణవైర గ్రంధమాల క్రింద వచ్చిన 12 నవలలు మహాభారతానంతర పూర్వయుగ భారతదేశ చరిత్రను మరొకవిధంగా చూపుతాయి. అయితే వీటిలో ప్రతి నవలా ఉత్సుకతో నిండిన కధ, అనితరమైన ఆయన శైలి, విశేషమైన పాత్రలతో పాఠకులను ఆకట్టుకొంటాయి.
- ఆంధ్రజాతి తన సాంప్రదాయాలకు అనుగుణంగా ఆయనను "కవి సామ్రాట్" బిరుదుతో సత్కరించింది.
- 1964లో ఆంధ్రా యూనివర్సిటీ "కళాప్రపూర్ణ" తో సన్మానించింది.
- 1942 సంక్రాంతికి ఆయనకు గుడివాడలో "గజారోహణం" సన్మానం జరిగింది. 1956 లో షష్టి పూర్తి వేడుకలు కూడా గుడివాడలో ఘనంగా జరిగాయి.
- శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం డి.లిట్ పట్టాతో సన్మానించింది.
- 1962లో "విశ్వనాథ మధ్యాక్కఱలు" రచనకు కేంద్రసాహిత్య అకాడెమీ వారి బహుమతి లభించింది.
- 1970లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆస్థాన కవిగా గౌరవించింది.
- 1970లో భారత ప్రభుత్వము పద్మభూషణ పురస్కారం తో గౌరవించింది.
- జ్ఞానపీఠ అవార్డు పొందిన తొలి తెలుగు రచయిత. 1971లో ఆయన "రామాయణ కల్పవృక్షము"నకు, జ్ఞానపీఠ పురస్కారాన్ని అందించినపుడు, సన్మాన పత్రంలో ఇలా వ్రాయబడింది
రచనల జాబితా:-
- నవలా సాహిత్యం వేయిపడగలు
- స్వర్గానికి నిచ్చెనలు
- చెలియలికట్ట
- ఏకవీర
- తెఱచిరాజు
- మాబాబు
- జేబుదొంగలు
- వీరవల్లడు
- వల్లభమంత్రి
- విష్ణుశర్మ ఇంగ్లీషు చదువు
- పులుల సత్యాగ్రహము
- దేవతల యుద్ధము
- పునర్జన్మ
- పరీక్ష
- నందిగ్రామరాజ్యం
- బాణావతి
- అంతరాత్మ
- గంగూలీ ప్రేమకధ
- ఆఱునదులు
- చందవోలు రాణి ప్రళయనాధుడు
- హాహాహూహూ
- మ్రోయు తుమ్మెద
- సముద్రపు దిబ్బ
- దమయంతీ స్వయంవరము
- నీల పెండ్లి
- శార్వరి నుండి శార్వరి దాక
- కుణాలుని శాపము
- ధర్మచక్రము
- కడిమిచెట్టు
- వీరపూజ
- స్నేహఫలము
- బద్దన్న సేనాని
- దిండు క్రింది పోకచెక్క
- చిట్లీచిట్లని గాజులు
- సౌదామిని
- లలితాపట్టణపు రాణి
- దంతపు దువ్వెన
- దూతమేఘము
- కవలలు
- యశోవతి పాతిపెట్టిన నాణెములు
- సంజీవకరణి
- మిహిరకులుడు
- భ్రమరవాసిని
- పురాణవైర గ్రంథమాల (పన్నెండు నవలలు)
- భగవంతునిమీది పగ
- నాస్తిక ధూమము
- ధూమమరేఖ
- నందో రాజా భవిష్యతి
- చంద్రగుప్తుని స్వప్నము
- అశ్వమేధము
- అమృతవల్లి
- పులిమ్రుగ్గు
- నాగసేనుడు
- హెలీనా
- వేదవతి
- నివేదిత
- నేపాళరాజ చరిత్ర (ఆరు నవలలు – దిన్డు క్రిన్ది పోకఛెక్క, ఛిట్లి ఛిట్లని గాజులు, సౌదామిని, లలిత పట్ట్ణపు రాణి, దూతమేఘము)
- కాశ్మీర రాజ చరిత్ర (ఆరు నవలలు – కవలలు, యశొవతి, పాతిపెట్టిన నాణీములు, సన్జీవ కరణి, మిహిర కులుడు, భ్రమర వాసిని)
పద్య కావ్యాలు:-
- శ్రీమద్రామాయణ కల్పవృక్షము(6 కాండములు)
- ఆంధ్రప్రశస్తి
- ఆంధ్రపౌరుషము
- విశ్వనాథ మధ్యాక్కఱలు
- ఋతు సంహారము
- శ్రీకుమారాభ్యుదయము
- గిరికుమారుని ప్రేమగీతాలు
- గోపాలోదాహరణము
- గోపికాగీతలు
- భ్రమరగీతలు ఝాన్సీరాణి
- ప్రద్యుమ్నోదయము
- రురుచరిత్రము
- మాస్వామి
- వరలక్ష్మీ త్రిశతి
- దేవీ త్రిశతి (సంస్కృతం)
- విశ్వనాథ పంచశతి
- వేణీభంగము
- శశిదూతము
- శృంగారవీధి శ్రీకృష్ణ సంగీతము
- నా రాముడు
- శివార్పణము
- ధర్మపత్ని
- భ్రష్టయోగి (ఖండకావ్యము)
- కేదారగౌళ (ఖండకావ్యము)
- గోలోకవాసి
- దమయంతీస్వయంవరం
నాటకములు:-
- అమృతశర్మిష్ఠమ్ (సంస్కృతం)
- గుప్తపాశుపతమ్ (సంస్కృతం)
- గుప్తపాశుపతము
- అంతా నాటకమే
- అనార్కలీ కావ్యవేద హరిశ్చంద్ర
- తల్లిలేని పిల్ల
- త్రిశూలము
- నర్తనశాల
- ప్రవాహం లోపల – బయట
- వేనరాజు
- అశోకవనము
- శివాజి – రోషనార
- ధన్యకైలాసము
- నాటికల సంపుటి (16 నాటికలు)
విమర్శలు:-
- అల్లసానివారి అల్లిక జిగిబిగి
- ఒకనాడు నాచన సోమన్న
- కావ్య పరీమళము
- కావ్యానందము నన్నయగారి ప్రసన్న కథాకలితార్ధయుక్తి
- విశ్వనాధ సాహిత్యోపన్యాసములు
- శాకుంతలము యొక్క అభిజ్ఞానత
- సాహిత్య సురభి నీతిగీత
- సీతాయాశ్చరితమ్ మహత్
- కల్పవృక్ష రహస్యములు
- సాహితీ మీమాంస.
ఇతరములు:-
- కిన్నెరసాని పాటలు
- కోకిలమ్మ పెండ్లి
- పాము పాట చిన్న కథలు
- ఆత్మ కథ
- విశ్వనాధ శారద (3 భాగాలు) యతిగీతము
మూలం: వికీపీడియా