Latest posts
-
ఏ దేశమేగినా ఎందు కాలెడినా
ఈ జాతీయగీతాన్ని రాయప్రోలు సుబ్బా రావు గారు రచించారు. రాయప్రోలు సుబ్బారావు రాసిన గీతాలలో అందరినోళ్లలోనూ బాగా నానిన “జన్మభూమి” గీతంలో తెలుగుదనం, జాతీయాభిమానం, గత వైభవ సంకీర్తనం, ప్రబోధం లాంటివి తొణికిసలాడుతుంటాయి. ఇప్పటికీ ఈ గీతం ఉత్తమ దేశభక్తి ప్రబోధంగా నిలిచిందనడంలో అతిశయోక్తి లేదు… రాయప్రోలు గొప్ప జాతీయవాది. తెలుగు జాతి అభిమాని. ఆయన దేశభక్తి గేయాలు ఎంతో ఉత్తేజకరంగా ఉంటాయి. ఏ దేశమేగినా ఎందు కాలెడినా ఏ పీఠమెక్కినా, ఎవ్వరేమనినా, పొగడరా నీ…
-
తమ్ముడా!
రాయప్రోలు సుబ్బారావు గారి కలం నుండి జాలువారిన దేశభక్తి గీతం, శ్రీలు పొంగిన జీవగడ్డయు, పాలు పారిన భాగ్యసీమయి, వ్రాలినది ఈ భరతఖండము భక్తి పాడర తమ్ముడా! వేద శాఖలు పెరిగె నిచ్చట, ఆదికావ్యం బందెనిచ్చట, బాదరాయణ పరమ ఋషులకు పాదు సుమ్మిది చెల్లెలా! విపినబంధుర వృక్ఖవాటికన వుపనిషన్మధు నొలికెనిచ్చట విపులతత్వము విస్తరించిన విమలతలమిదె తమ్ముడా! సూత్రయుగముల శుధ్ధవాసన క్షాత్రయుగముల శౌర్యచండిమ చిత్రదాస్యముచే చరిత్రల చెరిగిపోయెనె చెల్లెలా! మేలికిన్నెర మేళవించీ రాలు కరగగ రాగమెత్తీ పాలతీయని బాలభారత…