Latest posts

  • తమ్ముడా!

    రాయప్రోలు సుబ్బారావు గారి కలం నుండి జాలువారిన దేశభక్తి గీతం, శ్రీలు పొంగిన జీవగడ్డయు, పాలు పారిన భాగ్యసీమయి, వ్రాలినది ఈ భరతఖండము భక్తి పాడర తమ్ముడా! వేద శాఖలు పెరిగె నిచ్చట, ఆదికావ్యం బందెనిచ్చట, బాదరాయణ పరమ ఋషులకు పాదు సుమ్మిది చెల్లెలా! విపినబంధుర వృక్ఖవాటికన వుపనిషన్మధు నొలికెనిచ్చట విపులతత్వము విస్తరించిన విమలతలమిదె తమ్ముడా! సూత్రయుగముల శుధ్ధవాసన క్షాత్రయుగముల శౌర్యచండిమ చిత్రదాస్యముచే చరిత్రల చెరిగిపోయెనె చెల్లెలా! మేలికిన్నెర మేళవించీ రాలు కరగగ రాగమెత్తీ పాలతీయని బాలభారత…

    Read more

  • ఛాందస భావాలకు బావాలకు తొలి అడ్డుకట్ట “వేమన”

    “విశ్వదాభిరామ వినురవేమ” అనే మాట వినని తెలుగు వాడు ఉండడు. వానకు తడవనివారు, ఒక్క వేమన పద్యం కూడా రాని తెలుగువారు ఉండరని లోకోక్తి.  పామరులకు కూడా అర్థమయ్యే భాషలో పద్యాలు చెప్పి ప్రజల్ని మెప్పించిన కవి, వేమన . కడప మండలంలోని ఒక చిన్న పల్లెలో మధ్య తరగతి కాపు కులస్థులకు జన్మించాడని అంటున్నారు. ఆయన నందన నామ సంవత్సరము, ఆశ్వయుజ శుద్ధ పౌర్ణమి రోజున జన్మించారు. ఇతను యవ్వనంలో వేశ్యాలోలుడిగా జీవించాడు. కొంతకాలానికి విరక్తిచెంది,…

    Read more

  • శ్రీశ్రీ కలం నుండి జాలువారిన గొప్ప దేశభక్తి గీతం “పాడవోయి భారతీయుడా”

    స్వాతంత్ర్యం సంపాదించుకున్న మనం దాని విలువను గుర్తించగలిగామా! ఆ వీరుల త్యాగఫలాన్ని కున్న విలువ ఏమిటి? ఒకరినొకరం గౌరవించుకోలేని దుస్థితిలో ఉన్నాం. విపరీతమైన ఈర్ష్యా, ద్వేషాలు పెరిగిపోయినాయి. శ్రీ శ్రీ వ్రాసిన ఈ పాడవోయి భారతీయుడా–ప్రభోధగీతం మనం తప్పని సరిగా వినాలి ఈ పాటలో వున్న నగ్నసత్యాలు ఇప్పటికీ సంఘంలో పచ్చి నిజాలుగా మన కళ్లముందు సాక్షాత్కరిస్తున్నాయి. ఆనాడే బ్లాక్ మార్కెట్, పదవీ వ్యామోహాలు, కులమత భేదాలు, ప్రాంతీయ వాదాలు ఆయన ఊహించి పాటలో నిక్షిప్తం చేసారు. …

    Read more

  • మొదటి ఆధునిక తెలుగు కావ్యం: “ముసలమ్మ మరణం”

    డా.కట్టమంచి రామలింగారెడ్డి రచించిన “ముసలమ్మ మరణం”. తెలుగు సాహిత్యంలో ఒక కొత్త ఒరవడిని సృష్టించిన కావ్యం. ఇది “ముసలమ్మ” అనబడే ఒక గ్రామవనిత యొక్క త్యాగమయ, దయనీయ గాథ.కథకు మూలం చార్లెస్ పి. బ్రౌన్ రచించిన The History of Anantapuram (అనంతపుర చరితం). 1899లో ఆంధ్ర భాషాభిరంజిని వారి పోటీలో బహుమతి గెల్చుకొంది. 1900లో అచ్చయ్యింది. 107 గద్య పద్యాలున్న చంపూ కావ్యం ‘ముసలమ్మ మరణం’ కథ. 17వ పద్యంతో కథ మొదలవుతుంది. 104వ పద్యానికి…

    Read more

  • తెలుగు జాతి మనది …. నిండుగ వెలుగు జాతి మనది

    ఈ పాటను డా. సి. నారాయణ రెడ్డి గారు “తల్లా! పెళ్లామా!” చిత్రం కోసం వ్రాసారు. తెలుగు జాతి మనది …. నిండుగ వెలుగు జాతి మనది తెలుగు జాతి మనది …. నిండుగ వెలుగు జాతి మనది తెలంగాణ నాది … రాయలసీమ నాది … సర్కారు నాది … నెల్లూరు నాది .. అన్నీ కలిసిన తెలుగునాడు … మనదే … మనదే … మనదేరా.. తెలుగు జాతి మనది …. నిండుగ వెలుగు…

    Read more

  • జాషువా

    ఆధునిక తెలుగు కవుల్లో ప్రముఖ స్థానం పొందిన కవి గుఱ్ఱం జాషువా. తక్కువ కులంగా భావించబడ్డ కులంలో జన్మించి, ఆ కారణంగా అనేక అవమానాలు ఎదుర్కొన్నాడు.అయితే కవిత్వాన్ని ఆయుధంగా చేసుకుని ఈ మూఢాచారాలపై తిరగబడ్డాడు జాషువా; ఛీత్కారాలు ఎదురైన చోటే సత్కారాలు పొందాడు. ఈనాడు సంఘసంస్కర్తలకు జాషువా ఆదర్శ పురుషుడు. తెలుగు ప్రజల కవి. భాషా చంధస్సులో భావ కవి. వడగాల్పు నా జీవితమైతే వెన్నెల నా కవిత్వం అని ఆయన చెప్పారు. నిత్య జీవితంలో కాని…

    Read more

  • దాశరథి కృష్ణమాచార్యులు

    తెలంగాణ ప్రజల కన్నీళ్లను ‘అగ్నిధార’గా మలిచి నిజాం పాలన మీదికి  ఎక్కుపెట్టిన మహాకవి దాశరథి కృష్ణమాచార్యులు, “దాశరధి”గా ప్రసిద్ధుడు.  పద్యాన్ని పదునైన ఆయుధంగా చేసుకొని తెలంగాణ విముక్తి కోసం ఉద్యమించిన దాశరథి ప్రాతఃస్మరణీయుడు. నా తెలంగాణ కోటి రతనాల వీణ అని గర్వంగా ప్రకటించి ఇప్పటి ఉద్యమానికీ ప్రేరణనందిస్తున్న కవి దాశరథి. నిజాం ప్రభువుకి వ్యతిరేకంగా గొంతెత్తి… ఓ నిజాము పిశాచమా కానరాడు నిన్నుబోలినరాజు మాకెన్నడేని తీగెలను తెంపి అగ్నిలో దింపినావు నా తెలంగాణ కోటి రత్నాలవీణ అని ఎలుగెత్తి సభలలో…

    Read more

  • మా లోగో

    లోగో గురించి: పసుపు, కుంకుమ రంగులు మన సంస్కృతి కి చిహ్నాలుగా వాడటం జరిగింది. మధ్యలో ఉన్న చిహ్నం మన పూర్వీకులైన “శాతవాహనులు” కు గుర్తుగా తీసుకోవటం జరిగింది.  ఇది “ఉజ్జయిని చిహ్నం”, (ఒక + గుర్తులో నాలుగు అంచుల వద్ద నాలుగు వృత్తాలు). శాతవాహనులు వారి రాజధాని అయిన ఉజ్జయిని నగరానికి గుర్తుగా ఈ చిహ్నాన్ని తమ నాణేల పైన ముద్రించారు. క్రింద, “దేశ బాషలందు తెలుగు లెస్స” అని శ్రీనాధుడు మరియు శ్రీ కృష్ణదేవరాయులు…

    Read more

  • మన తెలుగు గురించి మీకు తెలుసా ??

    12వ శతాబ్ధిలో పాల్కురికి సోమనాధుడు "నవలక్ష తెలుంగు" – అనగా తొమ్మిది లక్షల గ్రామ విస్తీర్ణము గలిగిన తెలుగు దేశము – అని వర్ణించాడు. అచ్చుతో అంతమయ్యే విషయం వల్ల ఇది సంగీతపరంగా సంగీతకారులకు చాలా ఇష్టమైన భాష. పురాతత్వ పరిశోధనల ప్రకారము తెలుగు భాష ప్రాచీనత 2400 సంవత్సరాలనాటిది క్రీ.పూ.700 ప్రాంతంలో వచ్చిన ఐతరేయ బ్రాహ్మణము (ఋగ్వేదములో భాగము)లో మొదటిసారిగా "ఆంధ్ర" అనే పదం జాతి పరంగా వాడబడింది. క్రీ.పూ. 4వ శతాబ్ధిలో మెగస్తనీసు అనే…

    Read more

  • బ్రిటీష్ వారి కాలంలోనే వెలుగొందిన మన తెలుగు వైభవం

    మన తెలుగు బాష యొక్క ప్రాముఖ్యతను బ్రిటీష్ వారు సైతం గుర్తించారు అనటానికి నిధర్శనం వారు ముద్రించిన కరెన్సీ “అణా” “అణా” అని హింది, బెంగాలీ, ఉర్ధు లతో పాటుగా తెలుగులో ముద్రించారు. మరే ఇతర బాషలను వాడలేదు. వారి కాలంలో దేశంలో తెలుగు మాట్లాడే వారు మూడవ స్థానంలో ఉండటమే దీనికి కారణం.

    Read more