ధూమాదుల నావృతమై

పధ్యం:: 

ధూమాదుల నావృతమై 
వ్యోమంబునకెగని కలియు నుపములు తనలో 
శ్రీమించు శివుని జేరును 
గామాదుల గలియడతడు ఘనముగ వేమా 

తాత్పర్యము: 
భూమిపై ఏర్పడే పొగ మెల్లగా ఆకాశంలో కలుస్తున్నట్లుగానే, మానవునిలో ఉన్న జీవాత్మ ఈశ్వరునితో కలుసుకొనును. అప్పుడు జీవునికి కామాది వికారములుండవు.