నిజమాకల్ల రెండు నీలకంఠుడెఱుంగు
నిజములాడకున్న నీతిదప్పు
నిజములాడునపుడు నీ రూపమనవచ్చు
విశ్వదాభిరామ వినురవేమా!
తాత్పర్యము:
వాస్తవాలు, అవాస్తవాలు దేవుడికి తెలుస్తాయి. అందుకే ఎప్పుడూ నిజం మాట్లాడాలి. నీతిని ఎప్పటికీ విడిచిపెట్టకూడదు. నిజం చెప్పేవారిని పరమేశ్వర స్వరూపమే అనవచ్చు. నిజాలు చెబితేనే మన వ్యక్తిత్వం సంపూర్ణంగా ఆవిష్కృతమవుతుంది.