పదుగురాడుమాట పాడియై ధరజెల్లు

పధ్యం:: 

పదుగురాడుమాట పాడియై ధరజెల్లు 
నొక్కడాడుమాట యెక్కదెందు 
వూరకుండు వాని కూరెల్ల నోపదు 
విశ్వదాభిరామ వినురవేమ!

తాత్పర్యము: 
పదిమంది చెప్పిన మాట అసత్యమైన కూడా అదే న్యాయంగా చెల్లుతుంది. ఒక్కడే నిజం చెప్పినా నమ్మరు. వాగ్వివాదాలు జరిగే సమయంలో మౌనంగా ఉండేవాడే ఉత్తముడు.