బొంది యెవరి సొమ్ము పోషింపబలుమారు

పధ్యం:: 

బొంది యెవరి సొమ్ము పోషింపబలుమారు 
ప్రాణ మెవరి సొమ్ము భక్తిసేయ, 
ధనమదెవరిసొమ్ము ధర్మమె తన సొమ్ము 
విశ్వదాభిరామ వినురవేమ

తాత్పర్యము: 
ఎంతటి బలమైన ఆహారం పెట్టి పోషించినా శరీరం శాశ్వతం కాదు. ఎవరి ప్రాణాలు శాశ్వతం కాదు. డబ్బు కూడా నిలవదు. ఎన్నిటికైనా మనం చేసిన దానధర్మాలే నిలిచి ఉంటాయి. అందుకే అందరూ ధర్మబుద్ధిని కలిగి ఉండాలి.