Latest posts
-
నేడు “కవి సామ్రాట్ ” శ్రీ విశ్వనాథ సత్యనారాయణ గారి జన్మదినం.
విశ్వనాథ సత్యనారాయణ (1895-1976) "కవి సామ్రాట్" బిరుదాంకితుడు. తెలుగు సాహిత్యంలో తొలిజ్ఞానపీఠ అవార్డు గ్రహీత. 20 వ శతాబ్దములోని ఆంధ్ర సాహిత్యమునకు, ప్రత్యేకించి సంప్రదాయ సాహిత్యమునకు పెద్ద దిక్కు. ఆయన చేపట్టని సాహిత్య ప్రక్రియ లేదు.- కావ్యములు, కవితలు, నవలలు, నాటకములు, ప్రయోగములు, విమర్శలు, వ్యాసములు, కథలు, చరిత్రలు – ఆయన పాండిత్యము, ప్రతిభలు జగమెరిగినవి. ఆయన మాటలలోనే "నేను వ్రాసిన పద్యముల సంఖ్య , ప్రకటింప బడినవాని సంఖ్య, సుమారు ఇరువది వేలుండ వచ్చును. నేను…
-
నా కవితావాణీ – ౩
నా కనులతో నీవు లేని కలను కనని నేను నీవు లేని కలను కలనే భావించని నాకు ఇక నీ చూపే ఒక కలను చేసి వెళితే నీ రూపాన్ని మరవకుండా ఉండటానికి నేను ఇక శాశ్వత నిద్ర లోనే ఉంటాను నా చిరకాల స్వప్నమా!!!!!
-
నా కవితావాణీ – ౨
నీవు లేక చీకటి అయినది నా జీవితం కానీ నీ రాక తో వెలుగు నింపు తావని ఎదురు చూస్తున్న నాకు ఇక ఆ చేకటి నే చెలిమిని చేసి నన్ను ఆ నిశీధి లోనే ఉంచి నాకు ఉషోదయం లేకుండా చేయకే సఖి !!!!!!!
-
నా కవితావాణీ – ౧
చిరుగాలి చిన్నదైన పొందే అనుభూతి గొప్పది అలాగే నువ్వు చూసే చిరు చూపైన నేను పొందే అనుభూతి అనిర్వచనీయమయినది నిన్ను చూస్తూ ఉన్న ప్రతి క్షణం నీ ప్రతిబింబాన్ని నా కళ్ళలో దాచుకుంటాను కానీ నువ్వు కనుమరుగయ్యాక ఆ ప్రతిబింబం నీరుగా మారి నా చెక్కిలి ని తాకుతానంటుంది అలా చేస్తే ఎక్కడ నీ రూపాన్ని నా కనులు మరుస్తాయోనని వాటిని అక్కడే దాచి ఉంచి ఆ బాధను అనుభవిస్తున్నాను చెలి ………
-
జాషువా
ఆధునిక తెలుగు కవుల్లో ప్రముఖ స్థానం పొందిన కవి గుఱ్ఱం జాషువా. తక్కువ కులంగా భావించబడ్డ కులంలో జన్మించి, ఆ కారణంగా అనేక అవమానాలు ఎదుర్కొన్నాడు.అయితే కవిత్వాన్ని ఆయుధంగా చేసుకుని ఈ మూఢాచారాలపై తిరగబడ్డాడు జాషువా; ఛీత్కారాలు ఎదురైన చోటే సత్కారాలు పొందాడు. ఈనాడు సంఘసంస్కర్తలకు జాషువా ఆదర్శ పురుషుడు. తెలుగు ప్రజల కవి. భాషా చంధస్సులో భావ కవి. వడగాల్పు నా జీవితమైతే వెన్నెల నా కవిత్వం అని ఆయన చెప్పారు. నిత్య జీవితంలో కాని…