andrapradesh

ఆంద్రప్రదేశ్ అవతరణ దినోత్సవం

AndraPradeshనవంబర్ 1 వ తేదీ అంటే ఇవాళ ఆంద్ర ప్రదేశ్ అవతరణ దినం. 1953 వ సంవత్సరం ఇదే రోజు పదకొండు తెలుగు మాట్లాడే జిల్లాలు కలిసి ప్రత్యేక రాష్ట్రంగా అవతరించాయి. అంతకు ముందు ఇవి మద్రాస్ రాష్ట్రంలో ఉండేవి. రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా టంగుటూరి ప్రకాశం పంతులు పనిచేసారు. అనంతరం 1956 నవంబర్ ఇదే రోజున నిజాం పాలనలో ఉన్న తెలంగాణా ప్రాంతాన్ని ఆంద్ర ప్రదేశ్ లో విలీనం చేసారు.
 

దామోదరం సంజీవయ్య

Damodaram Sanjivayyaదామోదరం సంజీవయ్య, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రెండవ ముఖ్యమంత్రి మరియు తొలి దళిత ముఖ్యమంత్రి. సంయుక్త మద్రాసు రాష్ట్రములో, ఆంధ్ర రాష్ట్రములో, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో మరియు కేంద్ర ప్రభుత్వములో అనేక మార్లు మంత్రి పదవిని నిర్వహించాడు. రెండుసార్లు అఖిల భారత కాంగ్రేస్ కమిటీ అధ్యక్షుడు అవడము కూడా ఈయన ప్రత్యేకతల్లో ఒకటి. ఈయన కాంగ్రేసు పార్టీ తొలి దళిత అధ్యక్షుడు కూడా.

మన తెలుగు గురించి మీకు తెలుసా ??

  • 12వ శతాబ్ధిలో పాల్కురికి సోమనాధుడు "నవలక్ష తెలుంగు" - అనగా తొమ్మిది లక్షల గ్రామ విస్తీర్ణము గలిగిన తెలుగు దేశము - అని వర్ణించాడు.
  • అచ్చుతో అంతమయ్యే విషయం వల్ల ఇది సంగీతపరంగా సంగీతకారులకు చాలా ఇష్టమైన భాష.
  • పురాతత్వ పరిశోధనల ప్రకారము తెలుగు భాష ప్రాచీనత 2400 సంవత్సరాలనాటిది
  • క్రీ.పూ.700 ప్రాంతంలో వచ్చిన ఐతరేయ బ్రాహ్మణము (ఋగ్వేదములో భాగము)లో మొదటిసారిగా "ఆంధ్ర" అనే పదం జాతి పరంగా వాడబడింది.
  • క్రీ.పూ. 4వ శతాబ్ధిలో మెగస్తనీసు అనే గ్రీకు రాయబారి ఆంధ్రులు గొప్ప సైనికబలం ఉన్నవారని వర్ణించినాడు.
  • బౌద్ధ శాసనాలలోనూ, అశోకుని శాసనాలలోనూ ఆంధ్రుల ప్రస్తావన ఉన్నది.
  • ప్రపంచవ్యాప్తంగా 10కోట్ల మందికి పైగా ఈ భాషను మాట్లాడతారు.
  • కర్ణాటక సంగీతం లోని చాలా కృతులు తెలుగు భాషలోనే ఉన్నవి
  • తెలుగు అజంత భాష. అనగా దాదాపు ప్రతి పదము ఒక అచ్చుతో అంతము అవుతుంది. దీన్ని గమనించే 15వ శతాబ్దములో ఇటాలియన్ యాత్రికుడు నికొలో డా కాంటి తెలుగుని ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ (ప్రాచ్య ఇటాలియన్) గా అభివర్ణించాడు.

మన తెలుగుకు మళ్లీ వెలుగు

మన తెలుగుకు మళ్లీ వెలుగు

 తల్లిపాల మాధుర్యాన్ని తలపించేదే అమ్మభాష. అలాంటి మన తెలుగు, నేడు ఆంగ్ల ప్రభావంవల్ల చిక్కిశల్యమైపోతోంది. తెలుగు భాషావికాసోద్యమం మళ్ళీ మొదలైతే తప్ప, పరిస్థితి చక్కబడదు. విజయవాడలో నిన్న ప్రారంభమైన ‘ప్రపంచ తెలుగు రచయితల రెండో మహాసభ’లో పాల్గొన్న వక్తల ప్రసంగాల సారాంశమిదే. సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ‘ఈనాడు’ సంపాదకులు రామోజీరావు- భాషోద్ధరణ పాఠశాలనుంచి మొదలుకావాలన్నారు. వాడుకే భాషకు వేడుక అవుతుందని స్పష్టంచేశారు. తెలుగు భాష పునరుజ్జీవానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఆ కృషికి ‘తెలుగు రచయితల మహాసభ’ నాంది పలకాలన్నారు. రామోజీరావు ప్రసంగం పూర్తిపాఠమిది…

తెలుగు బాష ప్రాముఖ్యత (ప్రథమ బహుమతి పొందిన వ్యాసం)

తెలుగుభాష యొక్క ప్రాముఖ్యత

ఉపోద్గాతము :  “చక్కని పలుకుబడులకు, నుడికారములకు తెలుగు బాషయే పుట్టినిల్లు ”. చక్కని కవితలల్లిక లో జిగిబిగిని ప్రదర్శించిన నేర్పు ఈ బాషలోనే వీలైనది. అంతేగాక, అనేక బాషలు ఈ బాషలో చోటు చేసుకున్నాయి. ఎప్పుడైనా ఒక బాష  గొప్పతనం అన్ని బాషలూ నేర్చినగానీ తెలియదు. సంస్కృతము, తమిళము, పారసి మున్నగు బాషలు తెలిసిన రాయలు దేశబాషలందు  తెలుగులెస్స అనుట ఆశ్చర్యం గాదు. బ్రౌనుదొర కూడాఈ బాషను గూర్చి వేనోళ్ల పొగుడుట మన తెలుగు వారి, తెలుగు బాష యెక్క గౌరవము.

దేశ బాషలందు తెలుగు లెస్స: మన తెలుగు బాష దేశ బాషలలో గొప్పది. దేశబాషలందు తెలుగులెస్స, అని శ్రీకృష్ణదేవరాయలు తన “ఆముక్తమాల్యద” లో ఆంధ్రమహావిష్ణువు చే చెప్పించాడు. ఈ మాట ప్రతి తెలుగు వారి గుండెలలో నిరంతరం ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది. రాయల పైమాట తెలుగు వారి యెక్క మాతృబాషాభిమానానికి మేలుకొలుపు పాట అయ్యింది. బహుబాషా కోవిదుడైన రాయలు, ఆ బాష లోతుపాతులనెరిగి, మధించి భువన విజయ వికమాదిత్య న్యాయాధిపతిగా చెప్పిన తీర్పు దేశబాషలందు  తెలుగులెస్స అన్న మాట.

తెలుగు  బాష మాధుర్యం:   తెలుగు బాష మాధుర్యానికి కారణాలను పరిశేలిద్దాం. తెలుగు ద్రావిడ బాషలలో నుండి పుట్టింది. సహజముగా ద్రావిడ లక్షణములను బట్టి సరళము, సుకుమారము అయిన తెలుగువాణి, సంస్కృత బాషా కైకర్యం, గాంభీర్య పటుత్వాలను అలవరుచుకొని, తల్లికి, అక్కా చెల్లెండ్రకూ లేని క్రొత్త అందాలను అలవరుచుకుంది.

తెలుగు బాష ప్రాముఖ్యత (ధ్వితీయ బహుమతి పొందిన వ్యాసం)

మాతృ బాష యొక్క ప్రాముఖ్యత

ఉపోధ్ఘాతం:

మాతృమూర్తిపై, మాతృభూమిపై, మనసున్న ప్రతి మనిషికీ అవ్యాజమైన ప్రేమ, గౌరవం ఉంటుంది. అందుకే, “మాతృదేవోభవ” అని మనకు జన్మనిచ్చిన తల్లిని మొట్టమొదటగా స్మరించుకుంటున్నాం. ‘తల్లి ఒడి మొదటి బడి’ అన్నారు. వ్యక్తి జీవితంలో మొదట నేర్చుకునే బాష మాతృబాష. “జననీ జన్మ భూమిశ్చ, స్వర్గాధపి గరీయసి” అనడంలో మాత, మాతృభూమి, స్వర్గం కంటే మిన్న అని తెలుస్తుంది. మాతృబాష సహజంగా అబ్బుతుంది. అప్రయత్నంగా వచ్చేదే మాతృబాష.

 మాతృబాష:

Mother Tongue అనే ఆంగ్ల పదానికి సమానార్ధకంగా నేడు మాతృబాష అనే పదం వ్యవహారంలో ఉంది. శిశువు మొట్టమొధటిసారిగా తానొక బాషను నేర్చుకుంటున్నాననే జ్ఞానం లేనప్పుడు, తనలో ఉన్న అనుకరణ అనే సహజ ప్రవృత్తితో తన పరిసరాలలోని వారి బాషణాన్ని అనుకరిస్తూ, జీవితంలో  మొట్టమొదటిసారిగా నేర్చుకునే బాషే “మాతృబాష”. శిశువు సౌంధర్య దృష్టిని ఆనందానుభూతిని వ్యక్తం చేయటానికి ఉపయోగపడేది మాతృబాష అని గాంధీజీ భావించారు. “దేశ భాషలందు తెలుగు లెస్స” అని సాహితీ సమరాంగణ సార్వభౌముడైన శ్రీ కృష్ణదేవరాయులు ఆముక్తమాల్యధ లో తన ఇష్ట ధైవమైన శ్రీకాకుళాంధ్ర మహావిష్ణువు తో చెప్పించారు.

తెలుగు బాష ప్రాముఖ్యత (తృతీయ బహుమతి పొందిన వ్యాసం -౨)

తెలుగు బాష ప్రాముఖ్యత 

 “దేశ  భాషలందు తెలుగు లెస్స” అని శ్రీకృష్ణదేవరాయలు వారు అన్న మాటకు అర్థం మన దేశంలో ఎన్నిభాషలున్నా సరే ఏ భాష కూడా తెలుగుతో పోటీ పడలేదు అని. తెలుగు భాషలోని మాధుర్యం అంతా ఇంతా కాదు. ఉగ్గు పాల నుండి ఒక బిడ్డకి తల్లి పాట పాడేందుకు వీలైన భాష.తెలుగు భాషలోని స్పష్టత, నేర్పు, భావం, కూర్పు చాలా అందంగా ఉంటాయి. ఎందరో మహనీయులు, కవులు, కవయిత్రులు మన తెలుగు భాష యొక్క ప్రాముఖ్యతను గురించి చాటిచెప్పారు.

అందులో ప్రప్రధమంగా  నన్నయ, తిక్కన, యెఱ్ఱాప్రగడలు మహాభారతం వంటి గొప్పకావ్యాన్ని సంస్కృతం నుండి తెలుగులోకి, సామాన్య మనవుడికి అర్థమయ్యే విధంగా, చక్కగా అనువదించారు.ఆ కవిత్రయానికి జోహార్లు. వీరేకాక, గురజాడ అప్పారావు, వీరేశలింగం పంతులు, శ్రీశ్రీ, సి.నా.రె మొదలైన కవుల వరకు అందరూ ఎన్నో గొప్ప తెలుగు కావ్యాలు, కథలు రచించారు.

తెలుగు బాష ప్రాముఖ్యత (తృతీయ బహుమతి పొందిన వ్యాసం)

తెలుగు బాష ప్రాముఖ్యత 

 “దేశ  భాషలందు తెలుగు లెస్స” అని శ్రీకృష్ణదేవరాయలు వారు అన్న మాటకు అర్థం మన దేశంలో ఎన్నిభాషలున్నా సరే ఏ భాష కూడా తెలుగుతో పోటీ పడలేదు అని. తెలుగు భాషలోని మాధుర్యం అంతా ఇంతా కాదు. ఉగ్గు పాల నుండి ఒక బిడ్డకి తల్లి పాట పాడేందుకు వీలైన భాష.తెలుగు భాషలోని స్పష్టత, నేర్పు, భావం, కూర్పు చాలా అందంగా ఉంటాయి. ఎందరో మహనీయులు, కవులు, కవయిత్రులు మన తెలుగు భాష యొక్క ప్రాముఖ్యతను గురించి చాటిచెప్పారు.

 

Subscribe to RSS - andrapradesh